VIDEO: మాదారం పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ
VKB: పరిగి మండలం మాదారం పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. తమకు ఓట్లు వేయాలయంటూ కాన్వాసింగ్ చేస్తున్నారని బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏజెంట్లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. మాటమాటా పెరిగి ఘర్షణకు దారి తీయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయలైనట్లు సమాచారం.