ఆదిలాబాద్ ఎస్పీని కలిసిన మున్సిపల్ ఛైర్ పర్సన్
ఆదిలాబాద్ నూతన మున్సిపల్ ఛైర్ పర్సన్ అనూష ఎస్పీ అఖిల్ మహాజన్ను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఎస్పీ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి పాటు పడాలని ఆకాంక్షించారు. తన వంతు సహకారం ఉంటుందని ఎస్పీ తెలిపారు.