'సభకు ఊరూవాడా తరలి రావాలి'

NLG: ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే BRS రజతోత్సవ సభకు దేవరకొండ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే, BRS జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ పిలుపునిచ్చారు. అంగడిపేట స్టేజీ వద్ద గల BRS పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం అన్ని రకాలుగా BRS పాలనలోనే అభివృద్ధి చెందిందన్నారు.