విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం లెక్కింపు

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం లెక్కింపు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో బుధవారం భక్తులు స్వామి వారికి చేసిన వివిధ సేవల ద్వారా రూ. 1,62,983 ఆదాయం లభించిందని ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 128 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 33 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారని, 1,760 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.