సైబర్ మోసాలపై యువతకు అవగాహన

సైబర్ మోసాలపై యువతకు అవగాహన

KDP: జిల్లాలో సైబర్ నేరాలపై అప్రమత్తత పెంచేందుకు కడప తాలూకా సీ.ఐ టీ.రెడ్డెప్ప ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు నగర్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆన్‌లైన్ మోసాల ప్రమాదాలపై యువతకు సూచనలు ఇచ్చారు. అనుమానాస్పద కాల్స్‌కు స్పందించవద్దని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని హెచ్చరించారు.