నేడు జిల్లాలోని రైతుల ఖాతాలో రూ. 68.97 కోట్లు

నేడు జిల్లాలోని రైతుల ఖాతాలో రూ. 68.97 కోట్లు

W.G: అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం కింద ఈరోజు జిల్లాలోని 1,03,761 మంది రైతుల ఖాతాలలో రెండో విడతగా రూ. 68.97 కోట్లు జమ కానున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ. 2 వేలు, రాష్ట్రం వాటా రూ. 5 వేలు చొప్పున మొత్తం రూ. 7 వేలు జమ కానున్నాయి. నిధుల జమ కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.