జిల్లాలో 40 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
ADB: జిల్లాలో ఎండలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38°C నుంచి 40°C వరకు నమోదవుతుండగా, రాబోయే రోజుల్లో 42°C దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం వేళ వేడి గాలులు వీస్తుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఎండ నుంచి రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.