రైల్వే ట్రాక్పై మృతి చెందిన వ్యక్తి వివరాలు లభ్యం
ATP: తాడిపత్రి రైల్వే ట్రాక్పై మృతి చెందిన వ్యక్తి వివరాలు లభ్యమయ్యాయి. మృతుడు తిరుమల పరకామణి కేసులో కీలక వ్యక్తి అయిన CI సతీష్ కుమార్గా పోలీసులు గుర్తించారు. ఆయన ప్రస్తుతం గుంతకల్లో పనిచేస్తున్నారు. పరకామణి కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో సతీష్ ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.