యాదాద్రి దేవస్థాన నిత్య ఆదాయ వివరాలు
BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నిత్య ఖజానాకు సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. గురువారం సుమారు 20 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 640 మంది భక్త దంపతులు వ్రతాన్ని ఆచరించారు. అలాగే ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కార్ పార్కింగ్, కల్యాణకట్ట, యాదరుషి నిలయం, తదితరులు భాగాల నుంచి మొత్తం కలిపి రూ. 22,47,036 ఆదాయం వచ్చిందని తెలిపారు.