ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

SRD: భర్త మరణం తట్టుకోలేక ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కంది మండలం జిలకర గ్రామంలో శనివారం జరిగింది. గత జనవరిలో భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీన్ని తట్టుకోలేని భార్య మమత (28) ఇద్దరు పిల్లలు మణికంఠ (7), ప్రళయ (5) లకు విషం ఇచ్చింది. అనంతరం మమత ఉరి వేసుకొని మరణించింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.