TSWRS బాలికల హాస్టల్ల్లో వైద్యపరీక్షలు

JGL: మెట్పల్లి మండల వైద్యాధికారి డాక్టర్ అంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో జగ్గసాగర్ బాలికల హాస్టల్ నందు వైద్య శిబిరం నిర్వహించారు. దాదాపు 100 మంది హాస్టల్ విద్యార్థినులకు పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు రాకుండా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లత, డాక్టర్ నిఖిల మరియు సూపర్వైజర్లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.