దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం
ATP: గుంతకల్లు RTC బస్టాండ్లో ఇవాళ దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే 'దివ్యాంగ శక్తి' పథకాన్ని మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి ప్రారంభించారు. ఎమ్మెల్యే జయరాం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. మహిళలతో పాటు దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించిన సీఎం చంద్రబాబుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.