గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడి
WGL: దుగ్గొండి మండలలోని ముద్దునూరు గ్రామ పరిసరాల్లో గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని, తయారీ స్థావరాన్ని, పాత్రలను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. ఈ ఘటనలో జక్కుల స్వామి అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై రణధీర్ రెడ్డి తెలిపారు.