ఆదోనిలో వైద్యం లేక గాయకుడి మృతి
KRNL: ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక జిల్లా సాధన ఉద్యమ గాయకుడు మేలన్న గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కుటుంబానికి జేఏసీ నాయకులు ఇవాళ రూ.5,000 సాయం అందించారు. ఆయన మరణానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జేఏసీ నాయకులు ఆరోపిస్తూ.. రూ.10 లక్షల పరిహారంతో పాటు, ఆదోని జిల్లాను వెంటనే ప్రకటించాలని 108వ రిలే నిరాహార దీక్షలో నేతలు డిమాండ్ చేశారు.