VIDEO: విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం ఎంతంటే..?
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో మార్గశిర శుద్ధ తదియ ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.2,76,171 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 520 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 3,036 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.