అక్కాచెల్లెళ్లు మృతి.. UPDATE
TG: తాండూరుకు చెందిన ఎల్లయ్యగౌడ్కు నలుగురు కుమార్తెలు. గత నెల 15న పెద్ద కుమార్తె పెళ్లి జరిగింది. ఇవాళ జరిగిన బస్సు ప్రమాదంలో మిగిలిన ముగ్గురు కూతుర్లు చనిపోయారు. వారు హైదరాబాద్లోని కోఠి మహిళా కళాశాలలో చదువుతున్నారు. ఎల్లయ్య గౌడ్ డ్రైవర్గా పనిచేస్తూ పిల్లల్ని చదివించారు. ముగ్గురు కుమార్తెలు విగత జీవులుగా మారడంతో.. ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.