సమన్వయంతో జాతరను విజయవంతం చేద్దాం: ఆలీమ్ భాష
CTR: మార్చి 10, 11న పుంగనూరులో జరిగే శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయం అవసరమని మున్సిపల్ ఛైర్మన్ ఆలీమ్ భాష అన్నారు. బుధవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మధుసూదన్ రెడ్డి అని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి తగు సూచనలు సలహాలు ఇచ్చి దిశా నిర్దేశం చేశారు.