వాహనం ఢీకొని ఆవు మృతి.. వాహనదారుల ఆందోళన

వాహనం ఢీకొని ఆవు మృతి.. వాహనదారుల ఆందోళన

W.G: నరసాపురం జాతీయ రహదారిపై ఆదివారం గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒక ఆవు మృతి చెందగా, మరొకటి తీవ్రంగా గాయపడింది. యజమానులు పశువులను రోడ్లపై వదిలేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, పశువుల యజమానులపై చర్యలు తీసుకోవాలని.. రహదారులపై పశువుల సంచారాన్ని నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.