'గ్రామసభలను విజయవంతం చేయాలి'
SDPT: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వహించే గ్రామసభలకు అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో సభలను పకడ్బందీగా నిర్వహించాలని, ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు.