ఓపెన్ స్కూల్ పరీక్షా కేంద్రంలో జేసీ ఆకస్మిక తనిఖీ
W.G: భీమవరం చినరంగనిపాలెం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియట్ పరీక్షలను జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాల్ టిక్కెట్లు, సీటింగ్ ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షలు నిబంధనలకు అనుగుణంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.