VIDEO: మోషంపూర్లో కొవ్వొత్తుల ర్యాలీ
KMR: నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెరలో 2 నెలల పసి పాప మౌనిక మృతికి నిరసనగా శనివారం రాత్రి మోషంపూర్లో గ్రామస్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కుల వివక్షతో రజక కుటుంబంపై దాడి చేసి, పసి ప్రాణం బలి కావడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో గ్రామస్థులు రాజేందర్, పోచయ్య, నరేష్ మరియు రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.