సత్తా చాటుతున్న జిల్లా హాకీ క్రీడాకారులు

సత్తా చాటుతున్న జిల్లా హాకీ క్రీడాకారులు

VSP: బీహార్ రాష్ట్రం రాజగిరిలో జరుగుతున్న జాతీయస్థాయి సబ్ జూనియర్ హాకీ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. పాండిచ్చేరితో జరిగిన మ్యాచ్ లో గోల్ కీపర్ దేవేంద్ర వెంకట్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. సూర్య, చైతన్య చెరో గోల్ చేయడంతో 3-1 తేడాతో రాష్ట్ర జట్టు గెలుపొందినట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కే నరేష్ గురువారం తెలిపారు.