సీఎం ఏర్పాట్లపై సమీక్షించిన కలెక్టర్
VZM: ఈనెల 28న NTR భరోసా పింఛన్ల పంపిణీకి చీపురుపల్లి మండలం రావివలసకి సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారని, వారి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండి ఎవరికి కేటాయించిన విధులను వారు సక్రమంగా, సమన్వయంతో నిర్వహించాలన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో అధికారులతో చర్చించారు.