పుట్టపర్తిలో కొనసాగుతున్న ప్రయాణికుల రద్దీ

పుట్టపర్తిలో కొనసాగుతున్న ప్రయాణికుల రద్దీ

సత్యసాయి: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 100వ శత జయంతి ఉత్సవాలు ముగిసినప్పటికీ పుట్టపర్తి బస్టాండ్‌లో మంగళవారం కూడా ప్రయాణికుల రద్దీ తగ్గలేదు. వివిధ ప్రాంతాలకు వెళ్లే భక్తులు, ప్రయాణికులు భారీ సంఖ్యలో బస్సులు కోసం వేచి చూస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు అదనంగా ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.