భీమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం
SRCL: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, భీమన్న దేవస్థానంలో సోమవారం సోమవారం రాత్రి కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏఈఓ శ్రవణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుహాసినిలకు వాయినంగా పసుపు, కుంకుమ, గాజులు, స్వామివారి ఫోటోను అందజేశారు.