వరంగల్ మార్కెట్లో ఉత్పత్తుల ధరల వివరాలు..!
WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తికి రూ.6,870 ధర వచ్చింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.18,700 పలకగా... వండర్ హాట్(WH) మిర్చి రూ.19,500 పలికింది. తేజ మిర్చి ధర రూ.14,650కి చేరింది. మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి.