నకిలీ మద్యం కేసు..కస్టడీకి నిందితులు
అన్నమయ్య: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటి వరకు 23 మందిని నిందితులుగా గుర్తించగా, 16 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు జనార్దన్ రావుతో సహా మరో ఏడుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసులో నిజానిజాలు వెలికి తీసేందుకు ఎక్సైజ్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై తంబళ్లపల్లి కోర్టు విచారణ చేపట్టింది.