ఏప్రిల్ 2 న జరిగే సభల నిర్వహణపై సమీక్ష
WNP: గ్రామ సభలను సమయానుసారం నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వారు మాట్లాడుతూ గ్రామసభలు, మున్సిపల్ సభలో పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.