రెండో విడత సర్పంచ్ పదవి అభ్యర్థుల తుది జాబితా విడుదల
KMR: నిజాంసాగర్ మండలంలో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థుల తుది జాబితా ఎన్నికల అధికారులు ఇవాళ విడుదల చేశారు. మండలంలో 14 గ్రామ పంచాయతీలకు గాను 13 గ్రామ పంచాయతీలు ఎన్నికలకు సిద్ధం అయ్యాయి. మొత్తం 37 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి పోటీ చేయనున్నారు. అలాగే మండలంలో 122 వార్డు మెంబర్లకు గాను 101 వార్డ్ మెంబర్లు ఎన్నికలకు సిద్ధమయ్యారు.