ఉద్యోగస్తులకు సహజ మరణం భీమ
KMM: సింగరేణి సంస్థలో ఎస్బీఐ శాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగులకు సహజ మరణం సంభవిస్తే రూ. 10 లక్షల గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అమలు చేసేందుకు గురువారం సింగరేణి భవన్లో ఎస్బీఐతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటివరకు ప్రమాద మరణాలకు మాత్రమే కోటి రూపాయల బీమా ఉండగా, సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశాలు, డైరెక్టర్ గౌతమ్ పోట్రు చొరవతో అమల్లోకి వచ్చిందని అన్నారు.