అక్షరాంధ్ర పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత

అక్షరాంధ్ర పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత

AKP: ఈనెల 15వ తేదీన నిర్వహించిన అక్షరాంధ్ర పరీక్షలో శత శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వయోజన విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 93,292 మంది వయోజనలు ఈ పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు ముందు వీరికి మూడు నెలల పాటు రాయడం, చదవడం, లెక్కలు చేయడం నేర్పించినట్లూ అధికారులు పేర్కొన్నారు. సోమవారం వయోజన విద్యాశాఖ అధికారులు ఫలితాలను విడుదల చేశారు.