రాములోరి కళ్యాణం.. ముస్తాబైన దేవాలయాలు
KKD: రేపు జిల్లాలో రాములోరి కళ్యాణం వైభవంగా జరనుంది. జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో మర్యాద పురుశోత్తముడైన శ్రీ రాముని జన్మదినాన్ని పురష్కరించుకోని వేడుకలు జరపనున్నారు. దేవాలయాలు లైట్లు, తోరణాలతో ముస్తాబయ్యాయి. ఉదయం అర్చకులు మత్రోచ్చారణ మద్య పూజలు నిర్వహిస్తారు. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల సమర్పణతో కళ్యాణం నిర్వహిస్తారు. దేవాలయాలన్నీ శ్రీ రామ నామస్మరణతో మారుమ్రోగనున్నాయి.