'జిల్లాకు ఎర్ర బస్సు కాదు ఎయిర్ బస్సును తీసుకువస్తున్నాం'
ADB: ఆదిలాబాద్లో ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు ఎర్ర బస్సు రావడం కష్టమనుకున్న ఈ ప్రాంతానికి ఎయిర్బస్సుకు తీసుకువస్తున్నాం. ఏడాదిలో జిల్లాలో ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికలయ్యాక ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.