కాలినొప్పి భరించలేక గడ్డి మందు తాగి వ్యక్తి మృతి

కాలినొప్పి భరించలేక గడ్డి మందు తాగి వ్యక్తి మృతి

PDPL: ధర్మారం మండలం తండా-బి గ్రామానికి చెందిన భూక్యా దేలు (48) మూడు సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో కాలుకు గాయం కావడంతో తీవ్ర నొప్పితో బాధపడుతున్నాడు. నొప్పి భరించలేక గడ్డి మందు తాగగా కరీంనగర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య బుక లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం. ప్రవీణ్ కుమార్ తెలిపారు.