కడపలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలి: మక్బూల్ భాషా
కడప నగరంలో దోమల సమస్య రోజురోజుకు తీవ్రంగా మారుతోందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నగర కార్యదర్శి మక్బూల్ భాషా అన్నారు. నిల్వ మురికి నీటిలో ఆయిల్ బాల్స్ వేసి మందు పిచికారీ చేయాలని, కార్పొరేషన్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దోమల కాటుతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.