UPDATE: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
NLR: ఈనెల 19వ తేదీ రాత్రి ఉదయగిరికి చెందిన మైదుకూరు శ్రీనివాసులు (39) సర్వరాబాదు హైవే సమీపంలో ప్రమాదపు శాత్తు మోటారు బైక్పై నుంచి జారిపడి గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం శ్రీనివాసులు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.