కుటుంబ వివాదాల కారణంగా మహిళ ఆత్మహత్య
NDL: కొలిమిగుండ్ల మండలంలోని అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన జూటూరు పుష్పావతి(40) కుటుంబ వివాదాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు. బుధవారం రాత్రి 11 గంటలకు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, కుటుంబ సభ్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. గురువారం మృతి చెందినట్లు సీఐ వెల్లడించారు.