అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి

ప్రకాశం: అర్జీలపై సంబంధితశాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆదేశించారు. సోమవారం ఒంగోలులోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన మీ కోసం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన ఫిర్యాదుదారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.