బంగారుపాళ్యంలో అక్రమ కరెంట్ లైన్ కేసులో అరెస్ట్
CTR: బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ కరెంట్ లైన్ కారణంగా జరిగిన మరణాల కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. ఇందులో భాగంగా మూడవ తేదీన మండలంలోని దొడ్డి గ్రామంలో రామరాజు (32) తన పొలంలో ఎలక్ట్రిక్ వైర్లు అక్రమంగా లాగి కరెంట్ లైన్ తగిలించడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటనపై కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడు రామరాజును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.