షిరిడి సాయి పుణ్యతిథి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
KKD: రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీ శ్రీ శిరిడి సాయిబాబా మందిరం వద్ద బాబా పుణ్య తిధి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సాయిబాబా సేవకులు శర్మ మాట్లాడుతూ.. ప్రేమ, దయ, పరులకు సహాయం, దాతృత్వం, సంతృప్తి, అంతర్గత శాంతి, దేవుని పట్ల ,గురువు పట్ల భక్తి భావం బాబా బోధన సారాంశం అన్నారు. ఈ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఉదయం పంచామృతాభిషేకాలు జరుగుతాయన్నారు.