ఆటో, జీపు ఢీ : డ్రైవర్ పరిస్థితి విషమం
ADB: ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం ఆటో,జీపు ఢీకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆటోలో కూరాగాయలను ఎక్స్ రోడ్డులోని మార్కెట్లో అమ్యేందుకు తెల్లవారుజామున బయలుదేరాడు. ఈ క్రమంలోనే ఉట్నూర్ నుంచి ఆదిలాబాద్కి జీపు వెళ్తుండగా శ్యాంపూర్కి రాగానే రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.