శరవేగంగా ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు
SDPT: హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. చెరువును పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు 18 కోట్ల కేటాయించారు. గత సంవత్సరం మంత్రి పొన్నం ప్రభాకర్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. త్వరలో ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు పూర్తయి పట్టణ ప్రజలకు కనువిందు చేయనున్నాయి.