VIDEO: 'ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం'

ADB: ప్రజలకు ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని ఎంపీడీఓ గంగాసింగ్ అన్నారు. మంగళవారం నార్నూర్ మండల కేంద్రంలోని రైతువేదికలో పైలెట్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు ఉన్న సమస్యల ఫిర్యాదులను సేకరించారు. సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదులు సమర్పించి సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ అధికారి సాయిప్రసాద్ ఉన్నారు.