22 నిమిషాల్లోనే ఉగ్రస్థావరాలు ధ్వంసం: మోదీ

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా 22 నిమిషాల్లోనే పాక్ ఉగ్రస్థావరాలను నాశనం చేసినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్పై ప్రతిపక్షాలు రుజువులు అడుగుతున్నారని.. ఇందుకు సంబంధించి ప్రతీది దృశ్య రూపంలో ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఆపరేషన్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. పలు వైమానిక స్థావరాలు దెబ్బతినడంతో పాక్ కాళ్లబేరానికి వచ్చిందన్నారు.