శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
AP: తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 66,839 మంది భక్తులు దర్శించుకోగా.. 19,220 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.61 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.