'నియమ నిబంధనలకు ఎవరూ అతీతులు కారు'
విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ప్రతి MPకి సభలో మాట్లాడే అవకాశం కల్పించడానికి తాను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తానన్నారు. సభ నియమ నిబంధనలకు ఎవరూ అతీతులు కారని.. సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. MPల మైక్రోఫోన్లను నియంత్రించాననే ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.