నేడు శ్రీకూర్మనాథ క్షేత్రం మూసివేత

SKLM: శ్రీకూర్మనాథ క్షేత్రాన్న భాద్రపద పౌర్ణమి చంద్ర గ్రహణం సందర్భంగా మూసివేయనున్నట్లు ఆలయ ఈవో కె.నరసింహనాయుడు, ప్రధాన అర్చకులు సీహెచ్, సీతారాం నరసింహాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ఆలయాన్ని మూసివేస్తున్నామన్నారు. సంప్రోక్షణ అనంతరం స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తామన్నారు.