రాహుల్ గాంధీ ఒత్తిడి వల్లే కులగణన: ప్రభాకరరావు

కోనసీమ: దేశంలో కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ కామన ప్రభాకరరావు శుక్రవారం స్పందించారు. ఇది లోక్ సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ఒత్తిడి వల్లే ప్రభుత్వం దిగివచ్చి ప్రకటన విడుదల చేసినట్లు కామన తెలిపారు. రాహుల్ గాంధీ కులగణనపై పోరాడుతున్నారని పేర్కొన్నారు.