అగ్నిప్రమాద బాధితులను ఆదుకుంటాం: ఎంపీ
MNCL: కోటపల్లి మండలంలోని అన్నారం గ్రామంలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదం బాధాకరమని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్పందించి స్థానిక ఎస్సైతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించేందుకు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పరంగా సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.