ఫిషింగ్ హార్బర్పై వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది: మంత్రి
AP: జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్పై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. పరిశ్రమలు రాకుండా అడ్డుకునేందుకే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జువ్వలదిన్నె హార్బర్ను ప్రైవేటుపరం చేసే ఆలోచన లేదన్నారు. ఫిషింగ్ హార్బర్ అలాగే ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం మత్స్యకారుల బోట్లు యథాతథంగా తిరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు.